కోట్లమంది కళ్ళకు కనపడుతున్నా..మనిషి కి మనిషి కి మనసు కి మాత్రమె కనిపించే అడ్డుగోడలు..
దేవుడి పూజ లో సైతం "నా" కే పట్టం కడుతూ దేవుడికి అర్థం కాని స్వార్థాన్ని రుచి చూపించే ప్రయత్నాలు ..
మన లో మనం అన్న భావన చనిపోయి శతాబ్దాలయ్యాయి అని వేదం లాంటి చిత్ర సమీక్షల్లో వర్దంతి సందేశాలు..
మాటకు ఒకలా మనసుకు మరోలా మనుగడ సాగిస్తున్న మన జనం ..సాయం కావలిసి వచ్చేసరికి మానవత్వం మెదడు లో గంట కొడుతుంది ..మానవ జాతి ఎలా ఉండాలి అని ప్రసంగాలు పర పర పేపర్ల మీదకి పరిగెడతాయి ..పని పూర్తి అయిందా..అంతే..పీచే ముడ్..మళ్ళీ మన ఇరుకు గోడల్లోకి..బందుత్వ బందీఖనాల్లో కి..
ఎక్కడిది స్వార్థం...హీరో ఎలా ఉండాలో కరెక్ట్ గా ఊహిన్చగలిగె మనం..ఆ హీరో లోని మానవత్వం అన్న లక్షణాన్ని ..అందరం మనుషులమే..అన్న ఇంగితాన్ని ఇంజేక్షన్లతో ఇచ్చిన విసర్జిన్చేస్తాం ..
అనంత విశ్వం లో భూమి అణువంత ...ఆ సువిశాల అణువు మీది మానవ సామ్రాజ్యం కణం అంత..ఆ కణానికి సోకిన ఈ స్వార్థం అనే కాన్సెర్ మొదటికే ముప్పు తేకముందే..కనువిప్పు కలిగితే..సృష్టి ని గెలిచేది మనిషి..మరిచాడా..మట్టిలో కలిసెదీ మనిషే..
దైవమా..నీ దిక్సూచి ఎటు ?
0 comments:
Post a Comment
comment here whatever u want to.but please dont forget to put ur name also..have a great day