అమ్మ..
రెండక్షరాల ప్రేమను పూర్తిగా నిర్వచించే పదం..
పెదాల కలయికలో జనించే ఈ పదం విన్నపుడల్లా జనని కై నా చేతులు కలుస్తూనే ఉంటాయి.
నమస్కారమే కృతజ్ఞ్యత కు తార్కాణమైతే ఆజన్మాంతం అమ్మ కై నా చేతులు విడివడవు.
ప్రాణాన్ని పంచి పేగు ని తెంచి తను పునర్న్జన్మ ఎత్తి మనకు ఈ లోకాన్ని చూపే ఆ మాతృ మూర్తి మమత కు మరేది లేదు సాటి.
కన్న వారిని కంటికి రెప్పల కాపాడే ఆ చల్లని స్పర్శ ఉన్నంత కాలం లోకం లో సమస్యేలేవి మనల్ని తాకవు.
ప్రపంచం తలనొప్పి గ అనిపిస్తున్నపుడు ..పరిగెత్తుకుంటూ అమ్మ ఒడిలో చేరు.. ప్రశాంతత నిను వెతుక్కుంటూ వస్తుంది.
మొదటి సరిగా తెలుగు భాష చిన్నదేమో. అనిపిస్తుంది..అమ్మ ని వర్ణించటానికి
ఐనా అమ్మే విశ్వజనీనమైన్పుడు ఏ భాష ఐనా సరిపోదేమో.
దేవుడు లేడనే వాడు కూడా తలవంచి నమస్కరించే దేవత ..తల్లి !
నేటి నిజాలన్నీ రేపటికి సత్య దూరమవ్వచ్చు..
నీలాకాశాన్ని కారు మేఘాలు అలుముకోవచ్చు ..
మల్లె తెల్లదనం మాపటికి వాడిపోవచ్చు ..
గగనాన్ని వదిలిన జలరాశి జనని అవని ని చేరేలోగా ఆమ్లక్షారాది గా మారొచ్చు..
స్వచ్చత అనేది మచ్చుకు కూడా లేదని చింతిచే క్షణం లో...
ఒక్కసారి..
బొండు మల్లెలు విరజిమ్మే బోసి నవ్వు ని
చల్లని వెన్నెల ని పంచె చిన్ని కళ్ళని
చూడండి..
కాంక్రీటు వనం లో పచ్చని పల్లె చేలు దర్శనమిస్తుంది,,
రణగొణ ధ్వనుల మద్య కృష్ణశాస్త్రి పద్యం పాడుతుంది
మానవత్వం తత్వమంటే ఏంటో సోక్రటీసు సుప్రభాతం లా చేప్తున్నటు ఉంటుంది..
పసి మనసు కి పరాయి వాళ్ళ మీద పడే ఈర్ష్య తెలీదు.. పైకెత్తి ఆడిస్తే ప్రశాంతంగ నవ్వటం తప్ప..
ఆ చిట్టి చేతికి మనిషిని మనిషే ఎలా సమాది చేస్తున్నాడో తెలీదు..అంతా నా వారే అనుకోని చేయి అందివ్వటం తప్ప..
సృష్టి లో నిర్మలత్వం ఎక్కడో లేదు..చిట్టి చిట్టి చిన్నారుల మనస్సులో ఉందని..
మట్టి తగిలినా మలినమవని...
మబ్బు కమ్మినా చీకటి కాని ..ఆ అమాయకత్వం ..
సరిగా నను గమనిస్తే యావత్ ప్రపంచం ప్రశాంతం గా ఉండవచ్చని సందేశం ఇస్తున్నట్టు ఒక భ్రమ..
కాదు..ఆ దేవుడే మనల్ని మారమని ఈ చిన్నారుల ద్వారా మనకిచ్చే ఆదేశమేమో..
అపుడే కరిగిన మంచు బిందువు లాంటి ఆ పవిత్ర పాద స్పర్శ నాకైతే ఏదో చెప్తున్నట్టు వింత భావన.!